ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమల్లోకి తెస్తూ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం కొవిడ్ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు.. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించాలని ఆదేశించారు. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలన్నారు. మాస్క్‌లు ధరించకపోతే జరిమానా విధిస్తారు.